రూపాకుల కుటుంబీకులకు సత్కారం
ABN , First Publish Date - 2022-08-10T05:32:34+05:30 IST
స్వాతంత్య్ర సమరయోధులు రూపాకుల సుబ్రహ్మణ్యం, విశాలక్ష్మి దంపతులకు మంగళవారం ఘనంగా నివాళులర్పించారు.
మహారాణిపేట, ఆగస్టు 9: స్వాతంత్య్ర సమరయోధులు రూపాకుల సుబ్రహ్మణ్యం, విశాలక్ష్మి దంపతులకు మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. నెహ్రూ యువ కేంద్రం, జిల్లా యువజన సంక్షేమ సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మహారాణిపేట ప్రకృతి చికిత్స ఆలయంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎన్.సూర్యారావు అధ్యక్షతన సుబ్రహ్మణ్యం, విశాలక్ష్మి దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబీకులు అయిన రూపాకుల రవికుమార్, శ్రీ లక్ష్మిలను శాలువాలతో ఘనంగా సత్కరించారు.. ఈసందర్బంగా సూర్యారావు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలితమే వజ్రోత్సవ స్వాతంత్య్ర వేడుకలని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంక్షేమ శాఖ సీఈవో పి.నాగేశ్వరరావు, జి.ఉమామహేశ్వరరావు, డాక్టర్ లక్ష్మీనారాయణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.