రిజిస్ట్రార్ కార్యాలయాలు 7.30 నుంచి 11.30 వరకే
ABN , First Publish Date - 2021-05-07T05:46:39+05:30 IST
కరోనా విజృంభణతో ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు మారిపోతున్నాయి.
ఆచంట, మే 6 : కరోనా విజృంభణతో ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు మారిపోతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో గురువారం నుంచి కొత్త పనివేళలు అమలులోకి వచ్చాయి. ఉదయం ఏడున్నర నుంచి 11.30 గంటల మధ్య పనిచేస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు. కరోనా కర్ఫ్యూ దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనివేళలు మార్పులు చేసినట్టు అధికారులు తెలిపారు.