Kurnoolలో ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డ్పై క్రిమినల్ కేసులు నమోదు
ABN , First Publish Date - 2022-06-09T15:27:33+05:30 IST
జిల్లాలోని మద్దికెర పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు శ్రీరామ్ నాయక్, శేఖన్న, హోంగార్డ్ జహీర్పై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి.
కర్నూలు: జిల్లాలోని మద్దికెర పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు శ్రీరామ్ నాయక్, శేఖన్న, హోంగార్డ్ జహీర్పై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. మద్దికెరలో వైసీపీ నేత వాహనంలో రేషన్ బియ్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని వదిలేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఈ వ్యవహారంపై విచారణ చేసి కేసు నమోదు చేయాలని ఎస్పీ సుధీర్ కుమార్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.