హౌసింగ్ కాలనీకి రిజిస్ట్రేషన చేయించాలి
ABN , First Publish Date - 2021-03-07T04:55:01+05:30 IST
జగనన్న కాలనీకి మంజూరైన ఇళ్ల పట్టాల ను లబ్ధిదారులకు రిజిస్ట్రేషన చేయించాలని హౌసింగ్ శాఖ పీడీ రాజశేఖర్ అన్నారు.
పోరుమామిళ్ల, మార్చి 6: జగనన్న కాలనీకి మంజూరైన ఇళ్ల పట్టాల ను లబ్ధిదారులకు రిజిస్ట్రేషన చేయించాలని హౌసింగ్ శాఖ పీడీ రాజశేఖర్ అన్నారు. పోరుమామిళ్లలో కలసపాడు, కాశినాయన, పోరుమామిళ్ల, బికోడూరు మండలాల హౌసింగ్ ఏఈల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్చి 31 నాటికి ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నా రు.
పోరుమామిళ్లకు 1051, బి.కోడూరు 138, కలసపాడు 144, కాశినాయన 71 పట్టాల జాబితాలను సిద్దం చేసి కార్యరూపం జరిగేలా చర్య లు తీసుకోవాలన్నారు. పోరుమామిళ్ల మండలంలో 12 పంచాయతీల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. మ్యాపింగ్ కూడా చేయించుకోవాలన్నారు. హౌసింగ్ డీఈ రాజారత్నం, ఏఈ రాజశేఖర్ పాల్గొన్నారు. ఎంపీడీఓ నూర్జహాన, హౌసింగ్ వర్క్ఇన్సపెక్టర్లు పాల్గొన్నారు.