కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయండి

ABN , First Publish Date - 2021-03-01T04:56:58+05:30 IST

ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని రాష్ట్ర జేఏసీ చైర్మన్‌ కె.సుమన్‌ డిమాండ్‌ చేశారు.

కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయండి

దాసన్నపేట :  ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని రాష్ట్ర జేఏసీ చైర్మన్‌ కె.సుమన్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం కనపాక యూత్‌ హాస్టల్‌లో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిఽథిగా హాజరయ్యారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత  రెండు కమిటీలు ఏర్పాటు చేసినప్పటికీ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయలేదన్నారు. దీనిపై మంత్రివర్గ ఉప సంఘం ఓ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు.  సమావేశంలో జేఏసీ ప్రతినిధులు భానూజీ, అనిల్‌ కుమార్‌, మహేంద్రబాబు, రెడ్డి శేఖర్‌, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-03-01T04:56:58+05:30 IST