విద్యుత్ కార్మికులను రెగ్యులర్ చేయండి
ABN , First Publish Date - 2022-01-25T05:06:37+05:30 IST
విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను అందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పిన మాట ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకోవాలని యునైటెడ్ ఎలక్ర్టిసిటీ కాం టాక్ట్ వర్కర్స్ యూనియన్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు సుజన్, కొండయ్యలు కోరారు.
పోరుమామిళ్ల, జనవరి 24 : విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను అందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పిన మాట ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకోవాలని యునైటెడ్ ఎలక్ర్టిసిటీ కాం టాక్ట్ వర్కర్స్ యూనియన్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు సుజన్, కొండయ్యలు కోరారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో పోరుమామిళ్ల సబ్ డివిజన్ కమి టీ అధ్యక్షుడు మాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఆరు వేల మంది పీస్రేట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి న్యాయం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 2021 విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలన్నారు. గుంటూరులో ఫిబ్రవరి 27, 28న మహాసభలు జరుగుతాయని సమావేశానికి కార్మికులు అందరూ హాజరై జయప్రదం చేయా లన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే.శ్రీనివాసులు, సీఐటీ యూ జిల్లా కార్యదర్శి కే.నాగేంద్రబాబు, యూనియన్ కార్యదర్శి రాజశేఖర్, రమణారె డ్డి, సిద్ధారె డ్డి బ్రహ్మారెడ్డి, నాగేశ్వర్రెడ్డి, నబీ, వళి, హుసేన్పీరా తదితరులు పాల్గొన్నారు.