నాటుసారా నియంత్రణకు ఆపరేషన్ ‘పరివర్తన-2.0’
ABN , First Publish Date - 2022-05-17T04:38:02+05:30 IST
నాటుసారా అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేందుకు ఆపరేషన్ ‘పరివర్తన-2.0’ పేరిట సెబ్ అధికారులు చర్యలు చేపట్టినట్లు రాపూరు సెబ్ ఇన్చార్జ్ సీఐ శ్రీనివాసులు తెలిపారు.
పొదలకూరు, మే 16 : నాటుసారా అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేందుకు ఆపరేషన్ ‘పరివర్తన-2.0’ పేరిట సెబ్ అధికారులు చర్యలు చేపట్టినట్లు రాపూరు సెబ్ ఇన్చార్జ్ సీఐ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం పట్టణంలోని పలు ప్రొవిజన్స్ దుకాణ యజమానుల నుంచి నల్ల బెల్లం అధిక మొత్తంలో కొనుగోలు చేసిన వారి వివరాలను సేకరించారు. పొదలకూరు మర్చంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్.పెంచలయ్య సహకారంతో జరిగిన తనిఖీలో పొదలకూరు పోలీస్ కానిస్టేబుల్ పాల్గొన్నారు.