తెలిసిన వాడే కదా అని నమ్మితే దారుణం.. కిళ్లీ తినిపించి మరో ముగ్గురితో కలిసి సామూహిక అత్యాచారం..!

ABN , First Publish Date - 2022-08-21T21:20:45+05:30 IST

ఆ యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి వివాహానికి వెళ్లింది.. అక్కడ ఆమెకు తెలిసిన యువకుడు కనిపించడంతో సరదాగా మాట్లాడింది.

తెలిసిన వాడే కదా అని నమ్మితే దారుణం.. కిళ్లీ తినిపించి మరో ముగ్గురితో కలిసి సామూహిక అత్యాచారం..!

ఆ యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి వివాహానికి వెళ్లింది.. అక్కడ ఆమెకు తెలిసిన యువకుడు కనిపించడంతో సరదాగా మాట్లాడింది.. అతడు ఇచ్చిన కిళ్లీ తిని స్పృహ కోల్పోయింది.. ఆ యువతిని యువకుడు కిడ్నాప్ చేసి దూరంగా తీసుకెళ్లాడు.. అక్కడ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.. బాధితురాలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపించిన పోలీసులు విచారణ ప్రారంభించారు.


ఇది కూడా చదవండి..

Essay on Mother: తల్లి గురించి బాలుడు రాసిన వ్యాసం వైరల్.. ఫుల్ మార్కులు ఇస్తున్న నెటిజన్లు!


రాజస్థాన్‌ (Rajasthan)లోని జైపూర్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి ఈ నెల 4వ తేదీన వివాహం కోసం తన బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడ తనకు పరిచయస్తుడైన మనీష్‌తో మాటలు కలిపింది. మాట్లాడుతున్నప్పుడు ఆ యువతికి మనీష్ కిళ్లీ ఇచ్చాడు. అందులో కలిపిన మత్తు పదార్థం వల్ల తిన్న వెంటనే ఆ యువతి స్పృహ కోల్పోయింది. మనీష్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమెను ఇంటి నుంచి కిడ్నాప్ చేసి ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెపై నలుగురూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 


ఆ రోజు రాత్రంతా ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారం చేశారు. మరుసటి రోజు ఉదయం స్పృహలోకి వచ్చిన యువతిని నలుగురూ కలిసి బెదిరించారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారు. ఇంట్లో మౌనంగా ఉంటున్న యువతి తల్లిదండ్రుల ఒత్తిడితో అసలు విషయం బయటపెట్టింది. తనపై జరిగిన దారుణం గురించి వివరించింది. శనివారం మధ్యాహ్నం యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నలుగురు నిందితులపై ఫిర్యాదు చేవారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-08-21T21:20:45+05:30 IST