Rajasthan: వివాహితపై అత్యాచారం.. భర్తను చంపేస్తానని బెదిరించి దారణం.. చివరకు..
ABN , First Publish Date - 2022-09-24T21:33:26+05:30 IST
ఆమె వివాహిత.. ఆమె బంధువుల కుర్రాడు తరచుగా ఆమె ఇంటికి వెళ్లేవాడు..
ఆమె వివాహిత.. ఆమె బంధువుల కుర్రాడు తరచుగా ఆమె ఇంటికి వెళ్లేవాడు.. తెలిసిన వాడే కదా అని ఆమె అతడిని అనుమానించలేదు.. అదే ఆమెకు చిక్కులు తెచ్చి పెట్టింది.. ఆ మహిళ భర్త లేని సమయంలో ఆ కుర్రాడు దారుణానికి ఒడిగట్టాడు.. ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. విషయం ఎవరికైనా చెబితే ఆమె భర్తను చంపేస్తానని బెదిరించాడు.. కొన్ని రోజులు మౌనంగా ఉండిపోయిన బాధితురాలు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజస్థాన్ (Rajasthan)లోని జైపూర్లో ఈ ఘటన జరిగింది.
ఇది కూడా చదవండి..
Shocking: కాలేజీ ప్రిన్సిపాల్పై కాల్పులు జరిపిన విద్యార్థి.. కారణం ఏంటో తెలిస్తే షాక్..!
30 ఏళ్ల బాధిత మహిళ జైపూర్లోని ఓ ప్రాంతంలో తన భర్తతో కలిసి నివసిస్తోంది. ఆమెకు బంధువైన రఘునందన్ అనే వ్యక్తి తరచుగా ఆమె ఇంటికి వెళ్లేవాడు. బంధువే కదా అని ఎవరూ అతడికి అడ్డు చెప్పేవారు కాదు. కొన్ని రోజుల క్రితం బాధిత మహిళ భర్త వేరే ఉరు వెళ్లినట్టు రఘనందన్ తెలుసుకున్నాడు. రాత్రి సమయంలో ఆ మహిళ ఇంటికి వెళ్లాడు. ఒంటరిగా ఉన్న ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే భర్తను చంపేస్తానని బెదిరించాడు.
రఘనందన్ బెదిరింపులకు భయపడిన మహిళ చాలా రోజులు మౌనంగా ఉండిపోయింది. చివరకు తన భర్తకు, కుటుంబ సభ్యులకు అసలు విషయం చెప్పింది. వారి సహకారంతో శుక్రవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.