ఇంట్లో నుంచి నాలుగేళ్ల బాలిక అరుపులు విని లోపలికి వెళ్లిన తండ్రి.. అక్కడి దృశ్యం చూసి షాక్.. తనతో పాటు వచ్చిన వ్యక్తే..

ABN , First Publish Date - 2022-02-03T18:20:58+05:30 IST

అతను తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు.. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అతని కన్ను ఒంటరిగా ఉన్న నాలుగేళ్ల బాలికపై పడింది..

ఇంట్లో నుంచి నాలుగేళ్ల బాలిక అరుపులు విని లోపలికి వెళ్లిన తండ్రి.. అక్కడి దృశ్యం చూసి షాక్.. తనతో పాటు వచ్చిన వ్యక్తే..

అతను తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు.. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అతని కన్ను ఒంటరిగా ఉన్న నాలుగేళ్ల బాలికపై పడింది.. పశువులా మారి అభం శుభం తెలియని బాలికను బలాత్కరించాడు.. ఆ బాలిక అరుపులు పెట్టడంతో బయటి నుంచి తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు.. వెంటనే నిందితుడు బాలికను వదిలి పారిపోయాడు.. ఆ బాలికతో కలిసి తండ్రి  పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. రాజస్థాన్‌లోని జైపూర్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. 


దేబవాస్ గ్రామానికి చెందిన నారాయణ్ అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి బుధవారం మధ్యాహ్నం అతడి ఇంటికి వెళ్లాడు. లోపలికి వెళ్లి భోజనం చేశాడు. భోజనం తర్వాత స్నేహితుడు ఇంటి బయట కూర్చున్నాడు. అతని భార్య కిరాణా దుకాణానికి వెళ్లింది. లోపల ఒంటరిగా ఉన్న స్నేహితుడి నాలుగేళ్ల కూతురిపై నారాయణ్ కన్ను పడింది. ఆమెను బలాత్కరించడానికి ప్రయత్నించాడు. 


కొద్దిసేపటికి నొప్పిగా అనిపించడంతో ఆ బాలిక కేకలు పెట్టింది. ఆ కేకలు విన్న తండ్రి వెంటనే ఇంట్లోకి పరిగెత్తాడు. స్నేహితుడు రావడాన్ని గమనించిన నారాయణ్ వెంటనే అక్కణ్నుంచి పరారయ్యాడు. నొప్పితో విలవిలలాడుతున్న కూతురిని ఆమె తండ్రి వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో నారాయణ్‌పై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నారాయణ్‌ను అరెస్ట్ చేశారు.    

Updated Date - 2022-02-03T18:20:58+05:30 IST