ఉమ్మడి జిల్లాల తుది ఓటరు జాబితా విడుదల

ABN , First Publish Date - 2021-01-16T06:12:07+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల ఓటరు జాబితాను 2021 సంవత్సరం వరకు శుక్రవారం రాష్ట్ర చీఫ్‌ ఎలక్ర్టోరల్‌ ఆఫీసర్‌ శశాంక్‌ గోయల్‌ శుక్రవారం విడుదల చేశారు.

ఉమ్మడి జిల్లాల తుది ఓటరు జాబితా విడుదల

కామారెడ్డి టౌన్‌, జనవరి 15: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల ఓటరు జాబితాను 2021 సంవత్సరం వరకు శుక్రవారం రాష్ట్ర చీఫ్‌ ఎలక్ర్టోరల్‌ ఆఫీసర్‌ శశాంక్‌ గోయల్‌ శుక్రవారం విడుదల చేశారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 3కోట్ల 1లక్షల 65వేల 563మంది ఓటర్లను గుర్తించగా అందులో పురుషులు 1 కోటి 51లక్షల 61వేల 714 మంది ఉన్నారు. మహిళలు 1 కోటి 50లక్షల 2వేల 227 మంది ఉన్నారు. ఇతరులు 1,628 మంది ఉండగా కొత్త ఓటర్లు 2 లక్షల 82 వేల 497 మంది చేరారు. అందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో 19 లక్షల 43 వేల 59 మంది ఓటర్లను గుర్తించారు. ఇందులో నిజామాబాద్‌ జిల్లాలో 13లక్షల 11 వేల 557 మంది ఓటర్లు ఉన్నారు. గత నవంబరు 16 వరకు 13లక్షల 6 వేల 511 మంది ఓటర్లు ఉండగా 18,019 మంది కొత్తగా ఓటరు గా నమోదు చేసుకోగా 12,973 మంది ఓట్లు తొలగించబడ్డాయి. అదేవి ధంగా కామారెడ్డి జిల్లాలో 6 లక్షల 31వేల 502 మంది ఓటర్లు ఉన్నారు. గత నవంబరు 16 వరకు  6లక్షల 31వేల 860 మంది ఓటర్లు ఉండగా 4,439 మంది కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోగా 4,797 మంది ఓట్లు తొలగించబడ్డాయి.

Updated Date - 2021-01-16T06:12:07+05:30 IST