మెదక్ సబ్ జైలులో రిమాండ్ ఖైదీ మృతి
ABN , First Publish Date - 2022-05-06T17:11:53+05:30 IST
జిల్లా సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ భేటీ రాములు(45) మృతి చెందాడు.
మెదక్: జిల్లా సబ్ జైలులో రిమాండ్ ఖైదీ భేటీ రాములు(45) మృతి చెందాడు. ఈనెల 2న హత్యాయత్నం కేసులో రాములును అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలో రాములుకు ఛాతినొప్పి రావడంతో జైలు సిబ్బంది ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. కాగా రాములు మరణించడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.