ఎస్ఈకి రిమాండ్
ABN , First Publish Date - 2022-07-02T09:04:48+05:30 IST
ఎస్ఈకి రిమాండ్
కర్నూలు, జూలై 1: కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఈ సురేంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. కాంట్రాక్టరు నుంచి రూ.15లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఆయన పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో సీఐలు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. అనంతరం శుక్రవారం ఆయనకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ఏసీబీ కోర్టు సురేంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించిందని డీఎస్పీ తెలిపారు.