లెనిన్ మాటలు గుర్తొస్తున్నాయి: మందకృష్ణ
ABN , First Publish Date - 2022-03-16T23:23:12+05:30 IST
రాజ్యాంగంపై కేసీఆర్ వ్యాఖ్యలు వింటుంటే లెనిన్ మాటలు గుర్తొస్తున్నాయని
హైదరాబాద్: రాజ్యాంగంపై కేసీఆర్ వ్యాఖ్యలు వింటుంటే లెనిన్ మాటలు గుర్తొస్తున్నాయని ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ‘ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసు కోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు.’ అన్న లెనిన్ మాటలను ఆయన పరోక్షంగా గుర్తు చేశారు. రాజ్యాంగంపై కేసీఆర్ మాట్లాడిన తీరును అర్థం చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యo, స్వేచ్ఛకు కేసీఆర్ వ్యతిరేకమని ఆయన ఆరోపించారు. కేసీఆర్ రాజులా భావిస్తూ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ అంబేడ్కర్ను అవమానిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.