కవిటి మండలంలో నకిలీ టీచర్లను తొలగించండి

ABN , First Publish Date - 2021-06-22T05:26:19+05:30 IST

కవిటి మండలంలో నకిలీ దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలతో పనిచేస్తున్న ఉపాధ్యాయులను తక్షణం తొలగించాలని కేఎన్‌పీఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ఇన్‌చార్జి తహసీల్దార్‌ వి.లక్ష్మీనారాయణకు సంఘ ప్రతినిధులు బెలమర ప్రభాకరరావు, రాకెట్ల ఢిల్లేశ్వరరావు తదితరులు ఫిర్యాదు చేశారు.

కవిటి మండలంలో నకిలీ టీచర్లను తొలగించండి
ఇన్‌చార్జి తహసీల్దార్‌కు వినతిపత్రం అందిస్తున్న కేఎన్‌పీఎస్‌ ప్రతినిధులు

కేఎన్‌పీఎస్‌ నాయకుల ఫిర్యాదు 

నందిగాం, జూన్‌ 21: కవిటి మండలంలో నకిలీ దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలతో పనిచేస్తున్న ఉపాధ్యాయులను తక్షణం తొలగించాలని కేఎన్‌పీఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ఇన్‌చార్జి తహసీల్దార్‌ వి.లక్ష్మీనారాయణకు సంఘ ప్రతినిధులు బెలమర ప్రభాకరరావు, రాకెట్ల ఢిల్లేశ్వరరావు తదితరులు ఫిర్యాదు చేశారు. కవిటి మండలంలో ఎక్కువ శాతం నకిలీ దివ్యాంగ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, దీనివల్ల అర్హులైన, నిజమైన వారికి అన్యాయం జరుగుతోందన్నారు. ఇటువంటి సంఘ టన విజయనగరం జిల్లాలో చోటు చేసుకోగా అక్కడి అధికారులు విచారణ చేసి బాధ్యులను తొలగించారన్నారు. కవిటి మండలంలోని ఈ సమస్యపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇన్‌చార్జి తహసీల్దార్‌ మాట్లాడుతూ ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు దుర్యోధన, వాసు తదితరులు పాల్గొన్నారు.

 

 

Updated Date - 2021-06-22T05:26:19+05:30 IST