తొలగిన చీకట్లు
ABN , First Publish Date - 2022-09-24T05:35:50+05:30 IST
పట్టణంలోని బొగ్గులగొంది కాలనీలో నెల రోజులుగా వీధి లైట్లు వెలగకపోవటంతో రాత్రిళ్లు కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ‘చీకటిలో పేదల కాలనీ’ అనే కఽథనాన్ని శుక్రవారం ఆంధ్రజ్యోతి మినీలో ప్రచురించిన విషయం పాఠకులకు విదితమే.
ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన
కనిగిరి, సెప్టెంబరు 23 : పట్టణంలోని బొగ్గులగొంది కాలనీలో నెల రోజులుగా వీధి లైట్లు వెలగకపోవటంతో రాత్రిళ్లు కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ‘చీకటిలో పేదల కాలనీ’ అనే కఽథనాన్ని శుక్రవారం ఆంధ్రజ్యోతి మినీలో ప్రచురించిన విషయం పాఠకులకు విదితమే. దీంతో ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కఽథనానికి వెంటనే కమిషనర్ డీవీఎస్ నారాయణరావు స్పందించారు. తన సిబ్బందిని పిలిపించి పరిశీలించాలని ఆదేశించారు. దీంతో శుక్రవారం సిబ్బంది బొగ్గులగొంది కాలనీలోని శివాజి ఎయిడెడ్ స్కూల్ వీధిలోని వీధి దీపాలు పాడైపోయిన వాటి స్థానంలో కొత్తవి అమర్చారు. వీధి లైట్లు వేయించిన కమిషనర్కు, సిబ్బందికి, సమస్యను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లిన ఆంధ్రజ్యోతి కాలనీలోని గిరిజన కుటుంబాలు వారు కృతజ్ఞతలు తెలిపారు.