రెండేళ్లయినా.. రేషన్‌కార్డు రాలేదు !

ABN , First Publish Date - 2022-08-17T03:30:52+05:30 IST

మండలంలోని చిన్నగోపవరం లో మంగళవారం గడప గడపకు ప్రభుత్వంలో భాగంగా సమావేశం జరిగింది. సమావేశంలో గ్రా

రెండేళ్లయినా.. రేషన్‌కార్డు రాలేదు !
సభలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి

 గడప..గడపలో ఆనంకు బాధితుడి వినతి

అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

కలువాయి, ఆగస్టు 16:  మండలంలోని చిన్నగోపవరం లో మంగళవారం గడప గడపకు ప్రభుత్వంలో భాగంగా  సమావేశం జరిగింది.  సమావేశంలో గ్రామానికి చెందిన లక్కు మాల్యద్రిరెడ్డి  మాట్లాడుతూ తాను రెండేళ్లుగా తిరుగుతున్నా  రేషన్‌కార్డు మంజూరు చేయలేదని ఎమ్మెల్యే ఆనంకు వినతిపత్రం అందజేశారు. ఈ విషయమై ఎమ్మెల్యే అధికారులను ప్రశ్నించారు. అతడి దరఖాస్తు తిరస్కరణకు గురైందని అధికారులు చెప్పారు. ఎందుకు తిరస్కరణకు గురైందో తెలియజేయాలని ఎమ్మెల్యే ప్రశ్నించారు.ఇందుకు అధికారుల నుంచి సమాధానం లేకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతా రహితంగా వ్యవహరించిన సంబంధిత సచివాలయ సిబ్బందిపై జిల్లా కలెక్టరుకు రిపోర్టు పంపించాలని ఎంపీడీవోను ఆనం ఆదేశించారు. అనంతరం గ్రామంలోని పలు ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం ద్వారా ఆ కుటుంబాలకు అందిన లబ్ధిని ఎమ్మెల్యే వివరించారు. గ్రామంలో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బీ అనిల్‌కుమార్‌రెడ్డి, ఎంపీపీ ఆర్‌.లక్ష్మీదేవి,  వైస్‌ఎంపీపీ పంగా పెంచలనరసారెడ్డి,  నాయకులు ఎం.కృష్ణారెడ్డి, చల్లా సుబ్బరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


---------

Updated Date - 2022-08-17T03:30:52+05:30 IST