రేపల్లె రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు

ABN , First Publish Date - 2022-05-18T10:00:54+05:30 IST

బాపట్ల జిల్లాలో కొత్తగా రేపల్లె రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది.

రేపల్లె రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు

ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ


(అమరావతి-ఆంధ్రజ్యోతి): బాపట్ల జిల్లాలో కొత్తగా రేపల్లె రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చే సింది. 25 మండలాలున్న బాపట్ల జిల్లాలో రేపల్లె ఒక మండలంగా ఉంది. ఇప్పుడు 9 మండలాలతో రేపల్లెను కొత్తగా రెవెన్యూ డివిజన్‌ చేశారు. రేపల్లె, నిజాంపట్టణం, చెరకుపల్లి,భట్టిప్రోలు, వేమూరు, కొల్లూరు, అమర్తలూరు, టి సుండూరు, నాగారం మండలాలు ఈ డివిజన్‌ పరిధిలోకి వచ్చాయి. డివిజన్‌ ఏర్పాటుపై అభ్యంతరాలుంటే 30 రోజుల్లోగా బాపట్ల జిల్లా కలెక్టర్‌కు తెలియజేయాలని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌ ఉత్తర్వులు(జీఓ-352) జారీ చేశారు. 

Updated Date - 2022-05-18T10:00:54+05:30 IST