రేపటితో వేసవి విజ్ఞాన శిబిరం ముగింపు
ABN , First Publish Date - 2022-06-29T03:38:25+05:30 IST
స్థానిక శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి విజ్ఞాన శిబిరం గురువారం ముగుస్తుందని గ్రంథపాలకుడు ఎం. నాగ
కందుకూరు, జూన్ 28: స్థానిక శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి విజ్ఞాన శిబిరం గురువారం ముగుస్తుందని గ్రంథపాలకుడు ఎం. నాగయ్య తెలిపారు. మంగళవారం విద్యార్థులకు చిత్రలేఖనం పోటీతోపాటు నీతి కథలు చెప్పటం, విద్యార్థులతో కథలు చెప్పించటం, పుస్తక పఠనం, పుస్తక సమీక్ష కార్యక్రమాలు నిర్వహించామన్నారు. వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు గురువారం జరిగే ముగింపు కార్యక్ర మంలో బహుమతులు అందజేస్తామని తెలిపారు.