రోడ్లు బాగు చేయాలని వినతి

ABN , First Publish Date - 2021-07-28T04:51:19+05:30 IST

విజయనగరంలోని వివిధ ప్రాంతాల్లో అధ్వానంగా మారిన రోడ్లును బాగు చేయాలని టీడీపీ నేతలు కోరారు. ఈ మేరకు మంగళవారం కార్పొరేషన్‌ కార్యాలయంలో కమిషనర్‌ వర్మకు వినతిపత్రం ఇచ్చారు.

రోడ్లు బాగు చేయాలని వినతి
నగర కమిషనర్‌కు వినతిపత్రం ఇస్తున్న టీడీపీ నేతలు

రింగురోడ్డు, జూలై 27: విజయనగరంలోని వివిధ ప్రాంతాల్లో అధ్వానంగా మారిన రోడ్లును బాగు చేయాలని టీడీపీ నేతలు కోరారు. ఈ మేరకు మంగళవారం కార్పొరేషన్‌ కార్యాలయంలో కమిషనర్‌ వర్మకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం రోడ్లపై దృష్టి సారించకపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అడుగుకో గొయ్యి ఏర్పడడంతో తరచూ ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయని తెలిపారు.  రోడ్ల దుస్థితిపై ఇటీవల కోట వద్ద నిరసన ప్రదర్శన చేపట్టామని చెప్పారు.  ప్రస్తుతం అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నామన్నారు. ఇక దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టంచేశారు.  వినతిపత్రం ఇచ్చిన వారిలో టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, కనకల మురళీమోహన్‌, విజ్జపు ప్రసాద్‌, కర్రోతు నర్సింగరావు, ప్రసాదుల ప్రసాద్‌, బొద్దల నర్సింగరావు, గంటా పోలినాయుడు తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-07-28T04:51:19+05:30 IST