ప్రభుత్వ భూమిని కాపాడాలని తహసీల్దార్‌కు వినతి

ABN , First Publish Date - 2021-02-28T05:29:16+05:30 IST

మండలంలోని లక్ష్మక్కపల్లి సమీపంలోని రాజీవ్‌ రహదారి పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని ములుగు మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు గంగిశెట్టి శ్రీనివా్‌సగుప్తా, గ్రామస్థులు శనివారం తహసీల్దార్‌ యాదగిరిరెడ్డికి ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వ భూమిని కాపాడాలని తహసీల్దార్‌కు వినతి
వినతిపత్రాన్ని అందజేస్తున్న లక్ష్మక్కపల్లి గ్రామస్థులు

ములుగు, ఫిబ్రవరి 27: మండలంలోని లక్ష్మక్కపల్లి సమీపంలోని రాజీవ్‌ రహదారి పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని ములుగు మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు గంగిశెట్టి శ్రీనివా్‌సగుప్తా, గ్రామస్థులు శనివారం తహసీల్దార్‌ యాదగిరిరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ గుప్తా మాట్లాడుతూ రాజీవ్‌ రహదారి పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో కొందరు వ్యక్తులు లైసెన్స్‌ తీసుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు కొందరు ప్రైవేట్‌ వ్యక్తులు వాళ్లని బెదిరించి డబ్బు ఎరచూపి భూమిని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని, ఆ భూమిని ప్రైవేట్‌ వ్యక్తులకు పోకుండా నిలిపి వేసే విధంగా తహసీల్దార్‌ చర్యలు చేపట్టాలని కోరారు. ఆయన వెంట గ్రామస్థులు ప్రకాష్‌, ఆశ గల వెంకటేశం, నదీం తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-02-28T05:29:16+05:30 IST