రీసర్వేపై శిక్షణా తరగతులు

ABN , First Publish Date - 2021-04-18T06:08:54+05:30 IST

దేశంలో ఎక్కడా లేని విధంగా భూముల రీసర్వేను రాష్ట్రంలో ప్రవేశపెట్టామని ఆర్డీవో జి.శ్రీనుకుమార్‌ తెలిపారు.

రీసర్వేపై శిక్షణా తరగతులు

గుడివాడ, ఏప్రిల్‌ 17 : దేశంలో ఎక్కడా లేని విధంగా భూముల రీసర్వేను రాష్ట్రంలో ప్రవేశపెట్టామని ఆర్డీవో జి.శ్రీనుకుమార్‌ తెలిపారు. వెఎస్సార్‌ జగనన్న భూహక్కు, భూరక్ష పఽథకంలో భాగంగా భూముల రీసర్వేపై తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, మండల, గ్రామ సర్వేయర్లకు శనివారం  ఏఎన్నార్‌ కళాశాలలో డివిజన్‌ స్థాయి శిక్షణ సదస్సు శనివారం నిర్వహించారు. భూములు రీసర్వే చేయడం ద్వారా హద్దులను తెలపడమే ధ్యేయమన్నారు. గ్రామ, మండల సర్వేయర్లు తమ పరిధిలోని గ్రామాల సరిహద్దులు, పంట భూములను డ్రోన్‌ సహాయంతో ఎక్కువ ఇమేజ్‌ గల మ్యాప్‌లను ఏవిధంగా రూపొందించాలో తెలుసుకోవాలని సూచించారు. డివిజన్‌ పరిధిలో మండలానికి ఒక గ్రామాన్ని తొలి విడతగా ఎంపిక చేశామన్నారు. మాస్టర్‌ డ్రైనర్‌, డిప్యూటీ కలెక్టరు వెంకట్రావు, డీఎల్పీవో నాగిరెడ్డి, శిక్షకులు రామకృష్ణ, రవళి, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-18T06:08:54+05:30 IST