టీడీపీ హయాంలోనే రెస్కో అభివృద్ధి

ABN , First Publish Date - 2021-07-23T05:32:35+05:30 IST

చీపురుపల్లి ఆర్‌ఈసీఎస్‌ (రెస్కో) అభివృద్ధి తమ హయాంలోనే జరిగిందని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు.

టీడీపీ హయాంలోనే రెస్కో అభివృద్ధి
మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

చీపురుపల్లి: చీపురుపల్లి ఆర్‌ఈసీఎస్‌ (రెస్కో) అభివృద్ధి తమ హయాంలోనే జరిగిందని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. గురువారం రెస్కో మాజీ చైర్మన్‌ డి.రామచంద్రుడు, పార్టీ నాయకులు బలరాం, నాగరాజు మాట్లాడుతూ..  సంస్థను ఆరు కోట్ల ఆదాయానికి తీసుకెళ్లామన్నారు. ఆన్‌లైన్‌ బిల్లింగ్‌, రూ.24 కోట్లతో 480 ట్రాన్స్‌ఫార్మర్లు, 6వేల విద్యుత్‌ కనెక్షన్లు,  రైతులకు వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చామన్నారు. రెస్కో విలీనానికి సంబం ధించి ప్రభుత్వానికి సంబంధం లేదని వైసీపీ నేతలు   చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ నేతలు  రాంబాబు, అప్పల నాయుడు, వాసు, రమణమూర్తి పాల్లొన్నారు.
 
 

Updated Date - 2021-07-23T05:32:35+05:30 IST