తెలుగు రాష్ట్రాల్లో నిండుతున్న జలాశయాలు
ABN , First Publish Date - 2020-07-14T17:02:56+05:30 IST
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి.
హైదరాబాద్: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టులు కలకలలాడుతున్నాయి. దీంతో రైతులు ప్రాజెక్టులను చూసి పరవశించిపోతున్నారు. పలు చోట్ల ప్రాజెక్టులు, వాగులు, వంకలవద్దకు చేరి ప్రజలు కర్పూరాలు వెలిగించి గంగమ్మకు పూజలు చేస్తున్నారు.