విద్వేష వాతావరణాన్ని అడ్డుకోవాలి: ఫరూక్
ABN , First Publish Date - 2022-05-17T08:12:22+05:30 IST
వివిధ వర్గాల మధ్య చిచ్చుపెడుతున్న విద్వేషపూరిత వాతావరణాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా, మెహబూబూ ముఫ్తీ అన్నారు.
శ్రీనగర్, మే 16: వివిధ వర్గాల మధ్య చిచ్చుపెడుతున్న విద్వేషపూరిత వాతావరణాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా, మెహబూబూ ముఫ్తీ అన్నారు. వర్గాల మధ్య విద్వేషాలు తగ్గాలంటే.. ‘కశ్మీర్ ఫైల్స్’ లాంటి సినిమాలు, మీడియాలో ఎడతెగని హిందూ-ముస్లింల మధ్య చర్చలకు అడ్డుకట్ట వేయాలని సోమవారం అనంతనాగ్ జిల్లాలో అబ్దుల్లా చెప్పారు. కశ్మీర్ ఫైల్స్ విడుదలైన తర్వాత విద్వేషాలు రగులుకుంటున్నాయని ముఫ్తీ ఆందోళన వ్యక్తం చేశారు.