ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించండి
ABN , First Publish Date - 2021-08-03T04:50:43+05:30 IST
స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని కమిషనర్ లవన్న, కార్పొరేషన్ అఽధికారులకు ఆదేశించారు. కడప కార్పొరేషన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు.
కమిషనర్ లవన్న
కడప (ఎర్రముక్కపల్లె), ఆగస్టు 2: స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని కమిషనర్ లవన్న, కార్పొరేషన్ అధికారులకు ఆదేశించారు. కడప కార్పొరేషన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం కమిషనర్ మాట్లాడుతూ 48వ డివిజన్ పరిధిలోని సన్సిటీ ప్రాంతంలో వర్షపునీరు నిల్వ ఉందని, అక్కడ కంపచెట్లు పెరిగి విషసర్పాలు వస్తున్నాయని, వాటిని తొలగించాలని స్థానిక ప్రజలు అర్జీ ఇచ్చినట్లు తెలిపారు. బుడగజంగం కాలనీ, నంద్యాల నాగిరెడ్డి కాలనీవాసులకు శ్మశానవాటిక ఏర్పాటు చేయాలని సీపీఐ నాయకులు బాదుల్లా, మునెయ్య, భాగ్యలక్ష్మి ఫిర్యాదు చేశారన్నారు. ఈ సమస్యలను సత్వరం పరిష్కరించాలని డీఈ కరీముల్లా, ఏసీసీ నాగేంద్రలకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శివారెడ్డి, ఎస్ఈ, ఎంఈ, డీఈలతో పాటు అధికారులు పాల్గొన్నారు.