వార్డులో సమస్యలపై స్పందించాలి: కౌన్సిలర్
ABN , First Publish Date - 2021-10-26T07:24:51+05:30 IST
వార్డులో సమస్యలు పరిష్కరించాలని పట ణంలోని ఆరో వార్డు టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ సాయి కోరారు. తమ వార్డులో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మునిసిపల్ కార్యాలయం ఎదుట స్థానిక యువకులతో కలిసి మంగళవారం ధర్నా చేశారు.
మునిసిపల్ కార్యాలయం ఎదుట ఆరో వార్డు కౌన్సిలర్ ధర్నా
నేరేడుచర్ల, అక్టోబరు 25: వార్డులో సమస్యలు పరిష్కరించాలని పట ణంలోని ఆరో వార్డు టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ సాయి కోరారు. తమ వార్డులో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మునిసిపల్ కార్యాలయం ఎదుట స్థానిక యువకులతో కలిసి మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడ రోడ్డులోని కల్వర్టు వద్ద నీరు నిల్వ ఉంటోందని, కొండముచ్చు దాడులు పెరిగాయని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోవడంలేదన్నారు. దీంతో ధర్నాకు దిగాల్సి వచ్చిందన్నారు. సమస్యలు పరిష్కరిస్తామని మునిసిపల్ కమిషనర్ గోపయ్య కౌన్సిలర్కు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు