రేపటి నుంచి స్పందన
ABN , First Publish Date - 2021-07-25T05:55:16+05:30 IST
జిల్లా వ్యాప్తంగా ఈ నెల 26వ తేదీ నుంచి ‘స్పందన’ కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తున్నట్టు కలెక్టర్ వి.వినయ్చంద్ తెలిపారు.
గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ నిర్వహణ: కలెక్టర్ వినయచంద్
విశాఖపట్నం, జూలై 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఈ నెల 26వ తేదీ నుంచి ‘స్పందన’ కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తున్నట్టు కలెక్టర్ వి.వినయ్చంద్ తెలిపారు. గ్రామ సచివాలయాలతోపాటు మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో కచ్చితంగా స్పందన నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.కొవిడ్ కారణంగా కొంతకాలం నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని, ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో స్పందనను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఇకపై ప్రతి సోమవారం స్పందన ఉంటుందన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వున్న సమస్యలను స్పందన కార్యక్రమంలో పరిష్కరించడం జరుగుతుందన్నారు.
28న నూతన కలెక్టర్ మల్లికార్జున బాధ్యతల స్వీకరణ
జిల్లా కలెక్టర్గా నియమితులైన డాక్టర్ ఎ.మల్లికార్జున ఈనెల 28వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది. బదిలీపై వెళుతున్న వినయ్చంద్ నుంచి మల్లికార్జున బాధ్యతలు తీసుకోనున్నారు.