ఫుడ్ బాగలేదని అన్నారని.. కస్టమర్లపై దాడి చేసిన హోటల్ వర్కర్లు!

ABN , First Publish Date - 2022-05-10T08:01:59+05:30 IST

బాగా ఆకలితో హోటల్‌కు వెళ్లిన ఇద్దరు యువకులకు అక్కడి ఫుడ్ నచ్చలేదు. ఇంత చెత్తగా ఉందేంటి? అని మేనేజర్‌ని అడిగారు. అంతే ఆ మేనేజర్‌తోపాటు హోటల్‌లో పనిచేసే ఇద్దరు పనివాళ్లు కలిసి ఆ యువకులతో...

ఫుడ్ బాగలేదని అన్నారని.. కస్టమర్లపై దాడి చేసిన హోటల్ వర్కర్లు!

బాగా ఆకలితో హోటల్‌కు వెళ్లిన ఇద్దరు యువకులకు అక్కడి ఫుడ్ నచ్చలేదు. ఇంత చెత్తగా ఉందేంటి? అని మేనేజర్‌ని అడిగారు. అంతే ఆ మేనేజర్‌తోపాటు హోటల్‌లో పనిచేసే ఇద్దరు పనివాళ్లు కలిసి ఆ యువకులతో తీవ్రంగా గొడవ పడ్డారు. చివరకు వంట గదిలో నుంచి కత్తులె తెచ్చి దాడి చేశారు. ఈ ఘటన ఢిల్లీ సమీపంలోని నోయిడాలో వెలుగు చూసింది.


సెక్టార్ 15లోని ‘‘ది ఫుడ్ విల్లా’’ అనే రెస్టారెంటుకు రోహిత్, విశాల్ అనే ఇద్దరు యువకులు వెళ్లారు. అక్కడ ఆహారం బాగలేకపోవడంతో మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న మేనేజర్.. ఇద్దరు యువకులతో గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే హోటల్‌లోని మరో ఇద్దరు పని వాళ్లు కూడా వచ్చి గొడవ పడ్డారు. చివరకు రాహుల్, విశాల్‌పై హోటల్ సిబ్బంది కత్తులతో దాడి చేశారు.


విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితులు ముగ్గుర్నీ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రాహుల్, విశాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వాళ్ల పరిస్థితి చాలా విషమంగా ఉందని వెల్లడించారు.

Read more