ఇంద్ర సర్వీసులు పునఃప్రారంభం
ABN , First Publish Date - 2021-11-30T05:05:46+05:30 IST
కొవిట్తో నిలిచిపోయిన ఇంద్ర బస్సు సర్వీసులను పార్వతీపురం నుంచి విజయవాడకు పునఃప్రారంభిస్తున్నట్టు ఆర్టీసీ డిపో మేనేజర్ జాన్ సుందరం తెలిపారు.
పార్వతీపురం టౌన్ : కొవిట్తో నిలిచిపోయిన ఇంద్ర బస్సు సర్వీసులను పార్వతీపురం నుంచి విజయవాడకు పునఃప్రారంభిస్తున్నట్టు ఆర్టీసీ డిపో మేనేజర్ జాన్ సుందరం తెలిపారు. సోమవారం స్థానిక డిపోలో ఉన్న ఇంద్ర బస్సులను పరిశీలించారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో డిసెం బరు 1 నుంచి ఇంద్ర బస్సుల సేవలు అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. రోజూ సాయంత్రం 5.30 గంటలకు పార్వతీపురం డిపో నుంచి ఈ బస్సు బయ లుదేరుతుందన్నారు. విజయవాడలో రోజూ రాత్రి 9.20 గంటలకు బయలుదేరి... మరుసటిరోజు ఉదయం 9.20 గంటలకు పార్వతీపురం డిపోకు చేరుకుంటుం దన్నారు. ప్రయాణికులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎస్ఆర్టీసీ.ఇన్ ద్వారా ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు.