భీమవరం అసైన్డ్ను రీసర్వే చేయండి
ABN , First Publish Date - 2022-07-06T06:28:30+05:30 IST
భీమవరం గట్టు వద్ద ఉన్న అసైన్డ్ భూమిని రీసర్వే చేసి దళితులకు తిరిగి పంపిణి చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం తహసీల్దార్ కె.నాగేశ్వరరావు కు వినతిపత్రం అందజేసింది.
వ్యవసాయ కార్మిక సంఘం
జగ్గయ్యపేట, జూలై 5: భీమవరం గట్టు వద్ద ఉన్న అసైన్డ్ భూమిని రీసర్వే చేసి దళితులకు తిరిగి పంపిణి చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం తహసీల్దార్ కె.నాగేశ్వరరావు కు వినతిపత్రం అందజేసింది. మంగళవారం సంఘం ప్రతినిధి కోట కల్యాణ్, సి.హెచ్.హనుమంతురావు తదితరులు గతంలో దళితులకు ఇచ్చిన భూమిని కొందరు భూస్వామ్యులు స్వాధీనం చేసుకున్నారన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్, నాగమణి, కోట కృష్ణ, రాము, ఆదాం పాల్గొన్నారు.