కర్నూలు: కలెక్టరేట్ ముందు రిటైర్డు ఏఎస్ఐ నిరసన

ABN , First Publish Date - 2022-03-12T20:38:09+05:30 IST

కలెక్టరేట్ మహాత్మాగాంధీ విగ్రహం ముందు ఆదోని కంట్రోల్ రూమ్ రిటైర్డు ఏఎస్ఐ నాగరాజు నిరసన చేపట్టారు.

కర్నూలు: కలెక్టరేట్ ముందు రిటైర్డు ఏఎస్ఐ నిరసన

కర్నూలు: కలెక్టరేట్ మహాత్మాగాంధీ విగ్రహం ముందు ఆదోని కంట్రోల్ రూమ్ రిటైర్డు ఏఎస్ఐ నాగరాజు నిరసన చేపట్టారు. తాను రిటైర్ అయి 11 నెలలు అవుతున్నా.. ప్రభుత్వం నుంచి రావాల్సిన పెన్షన్, ఇతర సదుపాయాలు ఇంతవరకు రాలేదని ఆరోపించారు. కుటుంబపోషణ భారమైందని, ఆడిపిల్లలకు వివాహాలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల బాధలు తట్టుకోలేక ఆదోని నుంచి కర్నూలుకు వచ్చి తలదాచుకుంటున్నట్లు వాపోయారు. తనకు రావాల్సిన పెన్షన్, ఇతర సదుపాయాలను వెంటనే ఇవ్వాల్సిందిగా నాగరాజు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-03-12T20:38:09+05:30 IST