తిరుగు పయనమైన క్యాంపు నేతలు

ABN , First Publish Date - 2021-12-08T05:53:43+05:30 IST

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా క్యాంపు రాజకీయాలు పదిరోజులుగా జోరుగా సాగాయి. బెంగుళూరు, గోవా తదితర పర్యాటక ప్రాంతా ల్లో పర్యటించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజాప్రతినిధులు తిరుగు పయనమయ్యారు.

తిరుగు పయనమైన క్యాంపు నేతలు
తిరుమల దేవస్థానం వద్ద సిరిసిల్ల మున్సిపల్‌ కౌన్సిలర్లు, కుటుంబ సభ్యులు

సిరిసిల్ల, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా క్యాంపు రాజకీయాలు పదిరోజులుగా జోరుగా సాగాయి. బెంగుళూరు, గోవా తదితర పర్యాటక ప్రాంతా ల్లో పర్యటించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజాప్రతినిధులు తిరుగు పయనమయ్యారు. సిరిసిల్ల మున్సిపల్‌ కౌన్సిలర్లు, వారి కుటుంబ సభ్యులు మంగళవారం తిరుపతిలో తిరుమల శ్రీ వెంకవేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లి దర్శనం చేసుకుని తిరుగు పయనమయ్యారు. బుధవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌ విధానంపై అవగాహన కల్పించనున్నట్లు తెలిసింది. వీరు 10వ తేదీన సిరిసిల్లకు చేరుకుని ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 

Updated Date - 2021-12-08T05:53:43+05:30 IST