ఆగ్రహం పెల్లుబికితే ప్రగతి భవన్‌లు, ఫాంహౌస్‌లు బద్ధలైపోతాయ్: రేవంత్

ABN , First Publish Date - 2021-12-31T15:04:49+05:30 IST

తెలంగాణలో స్వేచ్ఛను సీఎం కేసీఆర్ హత్య చేస్తున్నాడని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ..

ఆగ్రహం పెల్లుబికితే ప్రగతి భవన్‌లు, ఫాంహౌస్‌లు బద్ధలైపోతాయ్: రేవంత్

హైదరాబాద్: తెలంగాణలో స్వేచ్ఛను సీఎం కేసీఆర్ హత్య చేస్తున్నాడని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతల ఇళ్లల్లోకి ఖాకీలను ఉసిగొల్పుతున్నాడన్నారు. సన్నిహితులు, మిత్రులు, బంధువుల ఇళ్లలో పరామర్శలకు, శుభకార్యాలకు కూడా వెళ్లనీయని నిర్భందకాండకు తప ఇంటి వద్ద దృశ్యమే ఉదాహరణ అన్నారు. ఇంకా రేవంత్ మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రికి వెన్నులో వణుకుపుడుతోంది. మేం ఇంట్లో నుంచి కాలు కదిపితే ఆయన గజగజ వణికిపోతున్నాడు. ప్రజాగ్రహం పెల్లుబికిన నాడు నీ ప్రగతి భవన్‌లు, ఫాంహౌస్‌లు బద్ధలైపోతాయి. జాగ్రత్త కేసీఆర్!ఇదేం సంస్కారం కేసీఆర్!?.. అర్థరాత్రి నుంచి పోలీసులతో ఇంటిని ముట్టడించడం… అనుమతి లేకుండా ఇంటి లోపలికి జొరబడటం… పరామర్శలకు కూడా వెళ్లకుండా నిర్భందించడం… ఇదేనా కేసీఆర్ నీ పాలనా సంస్కారం. తెలంగాణ నీ ప్రైవేటు ఎస్టేట్ అనుకుంటున్నావా? రైతులు చస్తుంటే… పరామర్శించడం పాపమా..? మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లల్లో శుభకార్యాలు, పరామర్శలకు వెళ్లి గంటల తరబడి గడుపుతున్న కేసీఆర్… ధాన్యం, మిర్చీ రైతుల చావుకేకలు నీ చెవికి చేరడం లేదా!? పెద్దోళ్ల ఇళ్లల్లో కార్యాలకు వెళతావు కానీ… పేదరైతు కుటుంబాన్ని పరామర్శించే తీరకలేదా!? నువ్వు ఎలాగూ వెళ్లవు… మేం పరామర్శిస్తుంటే నీకొచ్చిన నొప్పేంటి?’’ అంటూ మండిపడ్డారు.


Updated Date - 2021-12-31T15:04:49+05:30 IST