CM KCRకు టీపీసీసీ చీఫ్ Revanth reddy బహిరంగ లేఖ

ABN , First Publish Date - 2022-07-01T21:49:50+05:30 IST

సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

CM KCRకు టీపీసీసీ చీఫ్ Revanth reddy బహిరంగ లేఖ

హైదరాబాద్ (Hyderabad): సీఎం కేసీఆర్‌ (CM KCR)కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth reddy) బహిరంగ లేఖ (Letter) రాశారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు బేడీలు వేసి వేధించడంపై లేఖ రాశారు. తెలంగాణలో ప్రాజెక్టులు, రైతుల పొలాలకు నీళ్ల పేరుతో.. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు హద్దులు దాటుతున్నాయన్నారు. రీ డిజైన్ ఫలితంగా ముంపు గ్రామాల సంఖ్య పెరిగిందన్నారు. ప్రాజెక్టుల కోసం భూమి త్యాగం చేసిన రైతులను పట్టించుకోవడం లేదన్నారు. పరిహారం అడిగిన పాపానికి గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులపై లాఠీచార్జ్ చేసి అరెస్ట్ చేశారని మండిపడ్డారు. నిర్వాసితులకు పూర్తిగా న్యాయం చేసిన తర్వాతే.. ప్రాజెక్ట్ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తక్షణమే రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని, పరిహారం చెల్లించకపోతే పెద్ద ఎత్తున పోరాడతామని రేవంత్‌రెడ్డి ఆ లేఖలో స్పష్టం చేశారు.

Updated Date - 2022-07-01T21:49:50+05:30 IST