బీసీ సంఘాల ధర్నాకు రేవంత్రెడ్డి మద్దతు
ABN , First Publish Date - 2021-12-13T21:28:15+05:30 IST
బీసీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. జంతర్ మంతర్లో తెలుగురాష్ట్రాల బీసీ సంఘాలు ధర్నా నిర్వహించింది.
ఢిల్లీ: బీసీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. జంతర్ మంతర్లో తెలుగురాష్ట్రాల బీసీ సంఘాలు ధర్నా నిర్వహించింది. బీసీ సంఘాల ధర్నాకు రేవంత్రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జంతర్ మంతర్లో బీసీలు ధర్నా చేస్తుంటే.. వారికి సంబంధించిన 9 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాల ఓట్లతోనే కేసీఆర్ సీఎం అయ్యారని అన్నారు. అలాగే బీసీ కులగణన ఎందుకు చేపట్టడం లేదో చెప్పాలి? అని ప్రశ్నించారు. బీసీల అంశంపై పార్లమెంట్లో పోరాడుతామన్నారు.