రాజగోపాలరెడ్డి వ్యవహారంపై రేవంత్రెడ్డి వ్యాఖ్య
ABN , First Publish Date - 2022-07-27T20:11:49+05:30 IST
తెలంగాణ కాంగ్రెస్లో మునుగోడు రాజకీయం కొన్ని రోజులుగా రసవత్తరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో మునుగోడు రాజకీయం కొన్ని రోజులుగా రసవత్తరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాలరెడ్డి వ్యవహారంపై పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. రాజగోపాల్రెడ్డి అంశాన్ని పార్టీలో అంతర్గతంగా చర్చిస్తామన్నారు. అలాగే రాజగోపాలరెడ్డి వ్యవహారంపై హైకమాండ్దే తుది నిర్ణయమన్నారు. కాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్కు హ్యాండిచ్చి బీజేపీ కండువా కప్పుకుంటారంటూ వస్తున్న వార్తల క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు టెన్షన్ పడుతున్నారు. అమిత్ షాతో రాజగోపాల్ రెడ్డి భేటీ తరువాత బీజేపీకి చేరటానికి ఆయన అన్నిరకాలుగా సిద్ధమైనట్లు తెలుస్తోంది.