కరోనా రోగులకు సరైన వైద్యం అందించండి: రేవంత్ రెడ్డి
ABN , First Publish Date - 2021-05-15T17:13:30+05:30 IST
హైదరాబాద్: కరోనా రోగులకు సరైన వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్: కరోనా రోగులకు సరైన వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కరోనా బాధితులకు వైద్యం అందించేందుకు డాక్టర్లు ఆక్సిజన్, ఇంజక్షన్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఆస్పత్రుల్లో నిరంతరాయంగా ఆక్సిజన్, ఇంజక్షన్స్, మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామని రేవంత్ పేర్కొన్నారు.