TS News: వెంకట్‌రె‌డ్డి వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందన...

ABN , First Publish Date - 2022-08-05T19:38:35+05:30 IST

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏమన్నారంటే...

TS News: వెంకట్‌రె‌డ్డి వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందన...

ఢిల్లీ (Delhi): కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (MP Venkat Reddy) చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు. ఈ సందర్బంగా శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ  తమ మధ్య కొందరు అగాధం కల్గించే ప్రయత్నం చేస్తున్నారని, రాజ్ గోపాల్ రెడ్డి (Rajgopal Reddy) వేరు.. వెంకట్ రెడ్డి వేరని అన్నారు. వెంకట్ రెడ్డి తమ కుటుంబ సభ్యుడని, రాజ్ గోపాల్ రెడ్డి ద్రోహి అని అన్నారు. రాజ్ గోపాల్ రెడ్డి ప్రస్తావించే బ్రాండ్ కాంగ్రెస్ (Congress) ఇచ్చిందేనన్నారు. వెంకట్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా.. రాజ్ గోపాల్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు వెంకట్ రెడ్డికి సంబందం లేదన్నారు. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీతోనే బ్రాండ్ వచ్చిందని, చండూరులో కానీ, నకిరేకల్‌లో కానీ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మాట్లాడుతానన్నారు. ప్రాజెక్టులు తీసుకొని ఎవరెవరికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎంత ఇచ్చారో కూడా చెబుతానన్నారు.


సోనియా గాంధీ (Sonia Gandhi) నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కోసం కోమటిరెడ్డి బలంగా పనిచేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా ఎంపీగా కోమటి రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అనేక సేవలు చేశారన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా ఆయన ప్రచారంలో పాల్గొంటారని వ్యాఖ్యానించారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ ద్రోహి అని, వ్యాపారాల కోసం పార్టీ మారారని, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇవాళ ఈ స్థాయిలో ఉన్నారన్నారు. తాను చేసిన వ్యాఖ్యల్లో వెంకటరెడ్డి గురించి మాట్లాడలేదన్నారు. కేవలం రాజగోపాల్ రెడ్డి గురించి మాత్రమే మాట్లాడానని వివరించారు. రాజగోపాల్ రెడ్డి విసిరిన బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని రేవంత్ మరోసారి స్పష్టం చేశారు.

Updated Date - 2022-08-05T19:38:35+05:30 IST