Congress: పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌లో చేరిన యువత.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్

ABN , First Publish Date - 2022-09-18T20:13:04+05:30 IST

మునుగోడు, ఇబ్రహీంపట్నం నుంచి పెద్ద సంఖ్యలో యువత కాంగ్రెస్‌లో చేరారు.

Congress: పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌లో చేరిన యువత.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్

హైదరాబాద్ (Hyderabad): మునుగోడు (Munugodu), ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) నుంచి పెద్ద సంఖ్యలో యువత కాంగ్రెస్‌ (Congress)లో చేరారు. టీఆర్ఎస్ (TRS), సీపీఐ (CPI), సీపీఎం (CPM) నుంచి 300 మంది కాంగ్రెస్‌లో చేరారు. వారికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth reddy) కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు సర్పంచులు, ఎంపీటీసీలకు ఎంతో గౌరవం ఉండేదన్నారు. టీఆర్ఎస్, బీజేపీ అధికారంలోకి వచ్చాక స్థానిక నాయకులంటే పైరవీకారులన్న ముద్ర పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ చిచ్చు పెట్టాలని చూస్తున్నాయని, ఎన్నికల కోసం రోజుకో పంచాయితీ తీసుకొస్తున్నాయని, రాష్ట్రంలో పేదలు బతకలేని పరిస్థితి నెలకొందన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపుకు యువత కృషి చేయాలని రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు.

Updated Date - 2022-09-18T20:13:04+05:30 IST