కోట్ల విలువైన భూమిని కంపెనీలకు దోచిపెట్టారు: Revanth
ABN , First Publish Date - 2022-06-24T15:41:13+05:30 IST
దళితులకు మూడెకరాల భూమి కూడా లేదని.. గిరిజనులకు పోడు భూమిపై హక్కు లేదని.. కానీ తెలంగాణ ప్రజలకు చెందిన కోట్ల విలువైన భూమిని..
అమరావతి : దళితులకు మూడెకరాల భూమి కూడా లేదని.. గిరిజనులకు పోడు భూమిపై హక్కు లేదని.. కానీ తెలంగాణ ప్రజలకు చెందిన కోట్ల విలువైన భూమిని కంపెనీలకు దోచిపెట్టారని టీపీసీసీ చీఫ్ Revanth Reddy ట్విటర్ వేదికగా విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి కూడా లేదు.. గిరిజనులకు పోడు భూమిపై హక్కు లేదు. కానీ వేల కోట్ల ప్రైవేటు దోపిడీ, వందల కోట్ల పార్టీ ఆస్తులు ఉన్న సీఎం కేసీఆర్(CM KCR) ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (TRS) కి 33 జిల్లాల్లో వందల కోట్ల విలువ చేసే తెలంగాణ ప్రజల భూమిని దోచి పెట్టారు. ఈ బరితెగింపుని ఇట్లాగే వదిలేద్దామా!?’’ అని రేవంత్ ప్రశ్నించారు.