డ్రగ్స్‌ వినియోగంపై రేవంత్‌రెడ్డి సవాల్‌

ABN , First Publish Date - 2022-04-05T20:43:35+05:30 IST

హైదరాబాద్: డ్రగ్స్‌ వినియోగంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి సవాల్‌ చేశారు.

డ్రగ్స్‌ వినియోగంపై రేవంత్‌రెడ్డి సవాల్‌

హైదరాబాద్: డ్రగ్స్‌ వినియోగంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి సవాల్‌ చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పిల్లల్ని అడ్డం పెట్టుకొని తమపై రాజకీయమా? అంటూ మండిపడ్డారు. ‘మా పిల్లలందరికీ డ్రగ్స్‌ టెస్టులకు తీసుకొస్తా.. కేసీఆర్‌.. నీ కొడుకును కూడా డ్రగ్స్‌ టెస్టుకు పంపుతావా?’.. అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 24 గంటల పబ్‌లకు అనుమతి ఇచ్చింది ఎవరని నిలదీశారు. 125 మందికి డ్రగ్స్‌ టెస్టు చేయకుండా ఎందుకు విడిచిపెట్టారని ప్రశ్నించారు. డ్రగ్స్ అడ్డుపెట్టుకుని సినిమా రంగంపై సీఎం కేటీఆర్ పట్టు సాధించారని, డ్రగ్స్ వ్యవహారంపై నిష్పక్షపాత విచారణ జరగాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-04-05T20:43:35+05:30 IST