రైతు సంఘర్షణ సభను ప్రజలు విజయవంతం చేయాలి: రేవంత్‌

ABN , First Publish Date - 2022-04-23T22:49:28+05:30 IST

రైతు సంఘర్షణ సభను ప్రజలు విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

రైతు సంఘర్షణ సభను ప్రజలు విజయవంతం చేయాలి: రేవంత్‌

హైదరాబాద్: రైతు సంఘర్షణ సభను ప్రజలు విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మే 6, 7 తేదీల్లో రాహుల్ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. డిజిటల్ మెంబర్‌షిప్‌లో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. వరంగల్‌లో బహిరంగ సభలు పెట్టి టీఆర్ఎస్‌ బలంగానే ఉందంటూ.. ప్రతిసారి నిరూపించుకునే పరిస్థితి సీఎం కేసీఆర్‌దని ఎద్దేవాచేశారు. రైతులు తీవ్రమైన కష్టాల్లో ఉన్నారని రేవంత్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-04-23T22:49:28+05:30 IST