TS News: మంత్రి కేటీఆర్ ట్వీట్కు రేవంత్రెడ్డి కౌంటర్
ABN , First Publish Date - 2022-09-30T22:42:58+05:30 IST
Hyderabad: సాగరహారంపై మంత్రి కేటీఆర్ ట్వీట్కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చీమలు పెట్టిన పుట్టలో కల్వకుంట్ల పాములు చేరాయని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం సకల జనులది, సకల జనుల తరపున ప్రాతినిధ్యం వహించిన జేఏసీ ఆధ్వర్యంలో సాగరహారం జరిగిందని గుర్తు చేశారు. నాడు ఉద్యమంపై, నేడు రాష్ట్రంపై పడి బతకడం..మీకు అలవాటుగా మారిందని రేవంత్రెడ్డి విమర్శించారు.
Hyderabad: సాగరహారంపై మంత్రి కేటీఆర్ ట్వీట్కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చీమలు పెట్టిన పుట్టలో కల్వకుంట్ల పాములు చేరాయని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం సకల జనులది, సకల జనుల తరపున ప్రాతినిధ్యం వహించిన జేఏసీ ఆధ్వర్యంలో సాగరహారం జరిగిందని గుర్తు చేశారు. నాడు ఉద్యమంపై, నేడు రాష్ట్రంపై పడి బతకడం..మీకు అలవాటుగా మారిందని రేవంత్రెడ్డి విమర్శించారు.
కేటీఆర్ ట్వీట్ ఇదే..
సాగరహారానికి నేటితో పదేళ్లని మంత్రి కేటీఆర్ ట్వీట్ (KTR tweet) చేశారు. ‘‘తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ (KCR) నాయకత్వంలో పతాక స్థాయికి తీసుకెళ్లిన సందర్భం.. లక్షల గొంతుకలు 'జై తెలంగాణ (Jai Telangana)' అని నినదించిన రోజు.. ప్రతిరోజు పనికిమాలిన విమర్శలు చేసే ప్రతిపక్ష నేతలు రేవంత్ (Revanth), బండి సంజయ్ (Bandi Sanjay), ప్రవీణ్ కుమార్ (Praveen Kumar), షర్మిల (Sharmila) తెలంగాణ ఉద్యమంలో మీ జాడ ఎక్కడ?’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.