నేడు మాణిక్యం ఠాగూర్‌, కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌రెడ్డి భేటీ

ABN , First Publish Date - 2022-03-22T15:22:34+05:30 IST

నేడు మాణిక్యం ఠాగూర్‌, కేసీ వేణుగోపాల్‌తో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు.

నేడు మాణిక్యం ఠాగూర్‌, కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌రెడ్డి భేటీ

హైదరాబాద్: నేడు మాణిక్యం ఠాగూర్‌, కేసీ వేణుగోపాల్‌తో టీపీసీసీ అధ్యక్షుడు  రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు. తెలంగాణలో తాజా పరిణామాలను రేవంత్‌రెడ్డి మాణిక్యం ఠాగూర్‌, కేసీ వేణుగోపాల్‌ వివరించనున్నారు.  తెలంగాణ కాంగ్రెస్‌లో  సీనియర్ల పంచాయితీ ఇంకానూ కొన.. సాగుతోంది. సీనియర్ల మీటింగ్‌పై కాంగ్రెస్‌ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వి.హనుమంతురావుపై వేటు అంటూ కాంగ్రెస్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు వీహెచ్‌ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. కాగా పార్టీ బాధ్యతల నుంచి జగ్గారెడ్డిని తొలగించడంపై ఆయన రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-03-22T15:22:34+05:30 IST