TS News: మునుగోడులో ఎగిరేది కాంగ్రెస్ జెండానే: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-08-06T01:05:27+05:30 IST

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చరిత్ర హీనుడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) దుయ్యబట్టారు.

TS News: మునుగోడులో ఎగిరేది కాంగ్రెస్ జెండానే: రేవంత్‌రెడ్డి

నల్లొండ: ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చరిత్ర హీనుడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) దుయ్యబట్టారు. నల్లొండ జిల్లా చండూరులో నిర్వహించిన సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీకి ద్రోహం చేసిన నేత రాజగోపాల్‌రెడ్డి అని మండిపడ్డారు. రాజగోపాల్‌రెడ్డి దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడని మండిపడ్డారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy) చరిత్రహీనుడుగా మిగిలారని విమర్శించారు. నమ్మినవారిని మోసం చేసి కేంద్రమంత్రి అమిత్‌షా (Union Minister Amit Shah) వైపు వెళ్లాడని, కాంగ్రెస్ పార్టీలో పోరాటాలకు కలిసి రాలేదు కానీ.. కాంట్రాక్టుల కోసం అమిత్‌షా వైపు వెళ్తాడా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.


పార్టీ ప్రతిష్టను అమిత్‌షా కాళ్ల దగ్గర తాకట్టు పెట్టి.. రాజగోపాల్‌రెడ్డి 21 వేల కాంట్రాక్టులు తెచ్చుకున్నారని ఆరోపించారు. ఉపఎన్నికలతో కాంగ్రెస్‌కు వెంట్రుక కూడా ఊడలేదని చెప్పారు. తెలంగాణ తల్లి సోనియగాంధీ అని కొనియాడారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చారని తెలిపారు. మునుగోడులో ఎగిరేది కాంగ్రెస్ (Congress) జెండానేనని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసినవారికి గుణపాఠం చెప్పాలని పిలపునిచ్చారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా కుట్రల వల్లే సోనియాపై ఈడీ విచారిస్తోందని మండిపడ్డారు. సోనియాకు తెలంగాణతో పేగు బంధం ఉందని తెలిపారు. కాంగ్రెస్‌ను ఎదుర్కొనే సత్తాలేకే ఈడీతో దాడులు చేయిస్తున్నారని రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. 

Updated Date - 2022-08-06T01:05:27+05:30 IST