విపక్షాల అబద్ధపు ప్రచారాన్ని తిప్పి కొట్టండి: బాల్క సుమన్‌

ABN , First Publish Date - 2022-05-12T04:18:07+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను వారియర్స్‌ సోషల్‌ మీడియా ద్వారా తిప్పి కొట్టాలని ప్రభుత్వ విప్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌ పిలుపునిచ్చారు

విపక్షాల అబద్ధపు ప్రచారాన్ని తిప్పి కొట్టండి:  బాల్క సుమన్‌
మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌

హాజీపూర్‌, మే 11: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను వారియర్స్‌ సోషల్‌ మీడియా ద్వారా తిప్పి కొట్టాలని  ప్రభుత్వ విప్‌,  టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌ పిలుపునిచ్చారు. మండలంలోని వేంపల్లిలోని ప్రైవేటు ఫంక్షన్‌హాలులో  బుధవారం మంచిర్యాల నియోజకవర్గ స్ధాయి సోషల్‌ మీడియా వారియర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విప్‌ మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో జిల్లాలో బలమైన వారియర్స్‌ను తయారు చేస్తామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను సోషల్‌ మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని చెప్పారు.  రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా బూత్‌ లెవల్‌ స్ధాయి నుంచి  జిల్లా స్ధాయి వరకు సోషల్‌ మీడియా కమిటీలు వేస్తామన్నారు. సోషల్‌ మీడియాలో కష్టపడిన ప్రతీ కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, నస్పూర్‌ మున్సిపల్‌చైర్మన్‌ ప్రభాకర్‌, వ్యవసాయ మాట్‌ కమిటీ చైర్మన్‌ పల్లె భూమేష్‌, ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. 

Read more