Review meeting: విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష సమావేశం
ABN , First Publish Date - 2022-07-23T00:23:48+05:30 IST
Amaravathi: విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో నాడు-నేడు కింద చేపడుతున్న రెండో విడత అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
Amaravathi: విద్యాశాఖపై సీఎం జగన్ (CM Jagan) సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో నాడు-నేడు కింద చేపడుతున్న రెండో విడత అభివృద్ధి పనులను (Second Phase developmental works) వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. టీఎంఎఫ్, ఎస్ఎంఎఫ్లను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. స్మార్ట్ బోధన వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మేలు జరుగుతుందన్నారు. పీపీ–1 నుంచి రెండో తరగతి వరకూ స్మార్ట్ టీవీలు, 3వ తరగతి ఆపైన తరగతుల్లో ప్రొజెక్టర్ల ద్వారా విద్యాబోధన జరిగేలా చూడాలన్నారు. డీఈవో, ఎంఈవో సహా వివిధ స్థాయిల్లో పర్యవేక్షణ బాధ్యతలున్న పోస్టులను వెంటనే భర్తీచేయాలని ఆదేశించారు.