రేపు ఆర్జీయూకేటీ సెట్
ABN , First Publish Date - 2020-12-04T04:56:52+05:30 IST
రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ విద్యా సంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన సెట్-2020 శనివారం జరగనుంది.
35 కేంద్రాల్లో పరీక్ష
నెల్లూరు(స్టోన్హౌస్పేట), డిసెంబరు 3: రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ విద్యా సంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన సెట్-2020 శనివారం జరగనుంది. ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని డీఈవో పీ రమేష్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు పూర్వం డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లలో పొందుపరిచిన పరీక్ష కేంద్రాల్లోనే పరీక్షకు హాజరుకావాలని, పరీక్ష సమయం కంటే రెండు గంటల ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షను 35 కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.