మూలకు చేరిన బియ్యం బండి
ABN , First Publish Date - 2021-06-19T05:25:37+05:30 IST
మూలకు చేరిన బియ్యం బండి
- డీలర్ ఇంటివద్దే రేషన్ పంపిణీ
వంగర : ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించే బియ్యం బండి మూలకు చేరడంతో డీలర్ ఇంటి వద్దే సరుకులు పంపిణీ చేస్తున్న పరిస్థితి మండలంలో చోటుచేసుకుంది. మూడు పంచాయతీల పరిధిలోని వీవీఆర్ పేట, జేకే గుమ్మడ, రాజులగుమ్మడ, రుషింగి, చినరాజుల గుమ్మడ గ్రామాల్లో బియ్యం పంపిణీ కోసం ఏర్పాటు చేసిన వాహనం మరమ్మతులకు గురైంది. దీంతో సకాలంలో బియ్యం పంపిణీ చేయక పోవడంతో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 1683 మంది తెల్లరేషన్ కార్డుదారులు ఉన్నారు. డీలర్ గోప్యంగా ఇంటి వద్ద సరుకులు పంపిణీ చేస్తు న్నట్లు తెలిసింది. ఈ విషయమై తహసీల్దార్ ఐజాక్ వద్ద ప్రస్తావించగా వాహనం మొరాయించిన విషయం తన దృష్టికి రాలేదని, దీనిపై ఆరా తీస్తానన్నారు.